Read also:
ఒక్క క్లిక్తో కిసాన్ సమ్మాన్, రైతుబంధు స్టేటస్
రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం కిసాన్ సమ్మాన్, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏడాదికి 2విడతల్లో ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసింది.
PM KISAN SAMMAN
- పీఎం కిసాన్సమ్మాన్ సమాచారం తెలుసుకునేందుకుప్రభుత్వంhttp://pmkisan.gov.in/లోకి వెళ్లి బెన్ఫిషియర్ స్టేటస్పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత ఆధార్నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్నంబర్ ఎంటర్ చేస్తే మీకు బ్యాంకులో డబ్బులు పడ్డాయో లేదో తెలుస్తుంది.
RAITHU BANDHU
- అలాగే రైతుబంధు సమాచారాన్ని కూడా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.
- https://treasury.telangana.gov.in/ లోకి వెళ్లి స్కీంవైజ్ రిపోర్టుపై క్లిక్ చేయాలి.
- అప్పుడు సంవత్సరం వద్ద 2019-2020 అని, పథకం వద్ద రైతుబంధు అని, కొత్తపట్టాదారుపాస్ బుక్నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే సమాచారం తెలుస్తుంది.
- ఇలా ఇంటర్నెట్ ద్వారా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు.