Saturday, September 21, 2019

టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత



Read also:

తెదేపా మాజీ ఎంపీ, సీనియర్‌ నేత ఎన్‌. శివప్రసాద్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. సినీరంగంలోనూ ఆయనకు ప్రవేశంముంది. కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఎంపీగా పార్లమెంటులోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వాణిని బలంగా వినిపించారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు . 1951 జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించిన ఆయన2009,2014లో చిత్తూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు .నిన్న కన్నుమూసినట్లు వార్తలు వచ్చినా కుటుంబ సభ్యులు ఖండించారు . కాగా ఈ మధ్యాహ్నం గం . 2 : 07కు కన్నుమూసినట్లు సమాచారం .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :