Aadhaar-PAN linking Date extended-ఆధార్-పాన్ కార్డు లింకింగ్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే
Aadhaar-PAN linking: ఆధార్, పాన్ కార్డును ఇంకా అనుసంధానం చేయని వారికి శుభవార్త. ఆధార్, పాన్ లింకింగ్ గడువును మరోసారి పొడిగించింది కేంద్రం. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆధార్, పాన్ కార్డును ఇంకా అనుసంధానం చేయని వారికి శుభవార్త. ఆధార్, పాన్ లింకింగ్ గడువును మరోసారి పొడిగించింది కేంద్రం.
2021, జూన్ 30 లోపు ఆధార్ నంబర్తో పాన్ లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ బుధవారం ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి ఇప్పటికే అనేక సార్లు ఆధార్–పాన్ లింక్ గడువును కేంద్రం పొడిగించింది. గత ఏడాది నుంచి అవకాశాలు ఇస్తూనే ఉంది. కానీ చాలా మంది ఇప్పటికీ ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోలేదు.
ఐతే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్, పాన్ కార్డు లింకింగ్కు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ క్రమంలోనే మరోసారి గడువును పెంచాలని చాలా మంది కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలోనే మరోసారి గడువు పొడిగించారు. మార్చి 31 వరకు మాత్రమే ఉన్న ఆధార్ పాన్ అనుసంధానం గడువును.. జూన్ 30, 2021 వరకు పెంచుతున్నట్లు ఐటీశాఖ తెలిపింది.
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు పొడిగింపుపై కేంద్రం ప్రకటన గడువు తర్వాత పాన్, ఆధార్ నెంబర్స్ లింక్ చేస్తే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని.. ఫైనాన్స్ బిల్ 2021 లో కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.