Read also:
10th and Inter Exams 2021
- మే 5 నుంచి | ఇంటర్ పరీక్షలు
- షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సురేష్
రాష్ట్రంలో జూన్ 7వ తేదినుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 2020-2021 విద్యాసంవత్సరంకు సంబందించిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను బుదవారంనాడు విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పదోతరగతికి ఈ ఏడాది ఏడు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 7 న ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 8 సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9 ఇంగ్లీష్, జూన్ 10 మ్యాథమ్యాటిక్స్. జూన్ 11 ఫిజికల్ సైన్స్, జూన్ 12 బయోలాజికల్ సైన్స్, జూన్ 14న సోషల్ స్టడీస్ వుంటుందని తెలిపారు.