Read also:
దిల్లీ: విద్యార్థులతో ప్రధాని మోదీ ఏటా జరిపే ‘పరీక్షా పే చర్చ’ను కొవిడ్-19 నేపథ్యంలో ఈసారి ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. మార్చిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులతో ప్రధాని ముచ్చటిస్తారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులంతా పాల్గొనవచ్చని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. ఇందుకుగాను రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైనట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. మార్చి 14 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈమేరకు ‘మైగవ్’ ప్లాట్ఫాం ద్వారా ప్రశ్నలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు