Friday, February 19, 2021

మార్చిలో ప్రధాని ‘పరీక్షా పే చర్చ



Read also:

దిల్లీ: విద్యార్థులతో ప్రధాని మోదీ ఏటా జరిపే ‘పరీక్షా పే చర్చ’ను కొవిడ్‌-19 నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. మార్చిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులతో ప్రధాని ముచ్చటిస్తారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులంతా పాల్గొనవచ్చని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. ఇందుకుగాను రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గురువారం ప్రారంభమైనట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. మార్చి 14 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈమేరకు ‘మైగవ్‌’ ప్లాట్‌ఫాం ద్వారా ప్రశ్నలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :