Read also:
ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై పిటిషన్
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని న్యాయవాదులు పిటిషన్లో కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో మార్చి 10న పురపాలిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కణ్నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు.
12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.