Read also:
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 28,239 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 67 కేసులు నిర్ధారణ కాగా.. విశాఖలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,077కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,166 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 54 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,292కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 619 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,44,086 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.