Read also:
ఏపీ ఎంసెట్-2020 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీలో రిపోర్టు చేయడానికి 18 వరకు గడువు పెంచారు. సెకండ్ కౌన్సెలింగ్ కు సంబంధించి సవరించిన షెడ్యూల్ ఇదీ.
- నోటిఫికేషన్ విడుదల-జనవరి 10
- ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ధ్రువపత్రాల పరిశీలన-జనవరి 21-23
- వెబ్ ఆప్షన్ల నమోదు-జనవరి 21-23
- సీట్ల కేటాయింపు-జనవరి 25