Read also:
Ammavodi today highlighted points
- ఇక అమ్మఒడి లబ్ధిదారులకు సీఎం జగన్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు.
- వచ్చే ఏడాది నుంచి పథకంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
- 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే.విద్యార్థులు తల్లులు అమ్మఒడి కింద డబ్బులు వద్దంటే ఆ స్థానంలో వారికి ల్యాప్ టాప్ లు అందజేస్తామన్నారు.
- అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే సొమ్ము విద్యార్థులకు మరింత ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు.
- ఇందుకోసం HP, DELL, Lenevo, Acer లాంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపామని.. రూ.25వేల నుంచి రూ.27వేలు విలువ చేసే కంప్యూటర్ ను రూ.18,500కే అందిస్తామన్నారు.
- రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ధర ఇంకా తగ్గుతుందన్నారు.
- ఈ ల్యాప్ ట్యాప్ లో 4GB ర్యామ్, 500GB స్టోరేజ్, ఇంటెల్ ప్రాసెసర్, Windows-10 ఆపరేటింగగ్ సిస్టమ్ తో పాటు ఇతర అధునాతన ఫీచర్లు ఉంటాయన్నారు.
- ప్రతి ల్యాప్ టాప్ పై మూడేళ్ల వారెంటీ ఉంటుందని.. ఏదైనా సమస్య వస్తే గ్రామ సచివాలయాల ద్వారా 7 రోజుల్లోనే రీప్లేస్ లేదా రిపేర్ చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ వివరించారు.