18 నుంచి రెండు పూటలా బడులు
Read also:
- 18 నుంచి రెండు పూటలా బడులు
- పదో తరగతిపై ప్రత్యేక దృష్టి
పాఠశాలల్లో తరగతులను ఈ నెల 18 నుంచి రెండు పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే విడివిడిగా తరగతులకు మధ్యాహ్న భోజనాన్ని అందించి పాఠశాలను ముగిస్తున్నారు. ఇక నుంచి కరోనాకు ముందు నిర్వహించినట్లే యథావిధిగా బడులను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు.
రాష్ట్రంలో గత నవంబరు 2 నుంచి 9, 10 తరగతులను ప్రారంభించగా.. గత డిసెంబరు 14 నుంచి 7, 8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత 18 నుంచి ఆరు, ఇంటరు మొదటి ఏడాది తరగతులను ప్రారంభించనున్నారు.
పదో తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సమాయత్తం చేసేలా బోధన సాగించాలని భావిస్తున్నారు. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ తయారు చేస్తున్నారు.
1-5 తరగతుల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
About Janardhan Randhi
Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.