Tirumala: కొత్త ఏడాదిలో తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..! మీ కోసమే ఈ వార్త. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
రోజుకు 20 వేల టికెట్ల చొప్పున జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300 టికెట్లను టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒక యూజర్ ఐడీ నుంచి ఆరు టిక్కెట్ల వరకూ బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. 6 కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోలేరు.
కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న టీటీడీ నెలకొకసారి టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తోంది. టికెట్లను ఆన్లైన్లో పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తిరుమలలో ఈ నెల 25 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం జనవరి 4వ వరకు జరగనుంది.
కరోనా దృష్ట్యా మొదట స్థానికులకే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. ఐతే భక్తులకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో క్యూలైన్లో ఉన్న వారికి సైతం టోకెన్లు జారీ చేశారు.