Minister of Finance at the CS Committee Assembly meetings examining the PRC report
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 11వ పీఆర్సీ నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆ కమిటీ పరిశీలన తర్వాత నివేదిక అమలుపై నిర్ణయం తీసుకుంటాని చెప్పారు. ఈ లోపు 27శాతం ఐఆర్ ఉద్యోగులకు ఇస్తున్నామని చెప్పారు. 11వ పీఆర్సీ నివెదిక సమర్పించిన తర్వాత విషయం ప్రభుత్వం ఒక కమిటీకి అప్పచెప్పిన విషయం అధికారికంగా ప్రభుత్వం నుంచి వెల్లడించింది ఈ సందర్భంలోనే. పీఆర్సీ పై ప్రభుత్వం కమిటీ వేసోందన్న వార్తలు వచ్చాయే తప్ప అధికారిక ప్రకటన ఎప్పుడూ రాలేదు
ఉద్యోగుల సంక్షైమం ప్రభుత్వ విధానంపై గురువారం శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అనేక మంది పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొందరు సభ్యులు ప్రస్తావించిన విషయాన్ని మంత్రి గుర్తు చేస్తూ ప్రస్తుతం ఆర్థిక సవాల్ పరిస్థితి ఉందని, మూడు నెలల వాటు
రాష్ట్రానికి ఆదాయమే లేకుండా పోయిందని అన్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలు కూడా రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదల సంక్షేమమే, బడుగు బలహీనవర్ధాల సంక్షేమమే తమకు ముఖ్యమని ఆర్థిక మంత్రి చెప్పారు. అది ప్రభుత్వ బాధ్యత, మనందరి బాధ్యత అని చెప్పారు.
AP Departmental tests may-2020 Key Response Sheets
టీచర్స్ ట్రాన్సఫర్స్ ప్రోవిషనల్ సీనియారిటీ లిస్ట్