★ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుస్థానే సరుకుల పంపిణీలో జరిగిన అక్రమాలపై కాగ్ బృందాల ఆకస్మిక తనిఖీలతోపాటు, క్షేత్ర స్థాయిలో సోషల్ ఆడిట్ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.
★ ఆడిట్లో భాగంగా ఆయా తరగతులు, కేటగిరీల వారీగా విద్యార్థులకు పంపిణీ అయిన డ్రై రేషన్ సరుకుల వివరాలు, వాటి పరిమాణం,
★ ఎంఈవో లు, హెచ్ఎంలు, వలంటీర్ల భాగస్వామ్యం, వారి పాత్ర, రికా ర్డులు, రిజిష్టర్ల నిర్వహణ, స్కూలు పేరెంట్ కమిటీ చొరవ,
★ సరుకుల పంపిణీపై విద్యార్థులు, పేరెంట్స్ సంతృప్తి స్థాయి లు, వంటి అంశాలపై పాఠశాల స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి నివేదికలు రూపొందిస్తారు.
★ డ్రై రేషన్ సరుకులు ఏ ఒక్క విద్యార్థికి అందలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదని,
★ దీనికోసమే ఇప్పటి వరకూ జరిగిన పంపిణీపై సోషల్ ఆడిట్ను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.