Tuesday, December 29, 2020

బియ్యం కార్ఢు పునరుద్ధరించుకోండిలా



Read also:

  • వైఎస్‌ఆర్‌ నవశకం సర్వేతో పాటు వీఆర్‌ఓలు పౌరసరఫరాలశాఖ ఉద్యోగులు నిర్వహించిన విచారణలో భాగంగా బియ్యం కార్డులను రద్దు చేశారు. 
  • అనర్హత పున: పరిశీలనకు మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆయా అంశాల్లో అనర్హత సవాలు చేస్తూ సంబంధింత ధ్రువీకరణ పత్రాల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయడం ద్వారా కార్డుల్ని పునరుద్ధరించుకోవచ్ఛు.
  • ఆదాయ పన్ను చెల్లించకపోయినా చెల్లించినట్లు చూపించి కార్డు రద్దు చేస్తే ఛార్డెడ్‌ అకౌంటెంట్‌(సీఏ) ప్రాక్టీషనర్‌ నుంచి ఫారం-16 తీసుకుని సమర్పిస్తే కార్డు పునరుద్ధరిస్తారు.
  • 300 యూనిట్లకంటే తక్కువ విద్యుత్తు వినియోగం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి కార్డు రద్దు చేస్తే విద్యుత్తుశాఖ ఏఈ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పిస్తే కార్డు రద్దవ్వదు.
  • నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు గతంలో ఉన్న వివరాల ఆధారంగా కార్డు తొలగిస్తే ఆర్టీవో, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాలి.
  • కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ లేకపోయినా కార్డు తొలగిస్తే ఏ శాఖ ఉద్యోగిగా చూపించారో ఆ శాఖ పర్యవేక్షకాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాలి.
  • పదెకరాలకంటే తక్కువ భూమి ఉండి కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించి రద్దు చేస్తే తహసీల్దార్‌ నుంచి 1బీ ధ్రువపత్రం తీసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :