Read also:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియామకమయ్యారు. ఈ నెల 31న ప్రస్తత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. దాంతో అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అలాగే.. ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకమయ్యారు. ఇక సీఎస్గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.