Thursday, December 17, 2020

సి పి ఎస్ పై ప్రభుత్వానికి చేరిన కే ఏ పండిట్ కమిటీ నివేదిక



Read also:

  • సి పి ఎస్ పై ప్రభుత్వానికి చేరిన కే ఏ పండిట్ కమిటీ నివేదిక.
  • సీపీఎస్ అమలుపై చిత్తశుద్ధితో ఉన్నాం.విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
  • ప్రభుత్వ పరిశీలనలో కే ఏ పండిట్ కమిటీ బడ్జెట్ కేటాయింపుల రిపోర్టు

సీపీఎస్ కు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందని, కే ఏ పండిట్ కమిటీ ఇటీవల కమిటీ ఏర్పాటు చేశామని, ఇన్స్యూరెన్స్ప్రీ మియం, రిస్క్ లకు సంబంధించి బడ్జెట్కే టాయింపులపై ఈ కమిటీ రిపోర్టు అందజేసిందని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

  • సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
  • పెన్షన్ స్కీం సీపీఎస్ అమలుపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. 
  • సీపీఎస్ అమలుపై 2019 ఆగస్టులో మంత్రి వర్గ ఉప సంఘాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారన్నారు.
  • ఆ మంత్రి వర్గ ఉప సంఘంలో తాను కూడా ఉన్నానని, ఇప్పటికి ఎన్నో పర్యాయాలు భేటీ కూడా అయ్యామని తెలిపారు. 
  • సీఎస్ అడ్వయిజరీగా ఉండే వర్కింగ్ కమిటీ ఆఫ్సె క్రటరీస్ అనే కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు.
  • ఇన్స్యూరెన్స్ ప్రీమియం, రిస్క్ పై బడ్జెట్ కేటాయింపులకు కే ఏ పండిట్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 
  • బడ్జెట్ కేటాయింపులపై ఆ కమిటీ రిపోర్టు అందజేసిందని, ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.
  • ఇటీవల శాసనమండలి సమావేశాల్లో బుగ్గన రాజేంద్రనాథ్ సిపి ఎస్ పై స్పందిస్తూ కే ఏ పండిట్ కన్సల్టెన్సీ పరిశీలనలో ఉందని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :