ఉపాధ్యాయ బదిలీల్లో విద్యాశాఖ మొండి
వైఖరిని విడిచి పెట్టాలని, టీచర్ల ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని, ఉపాధ్యాయ పోస్టు లన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న ఎమ్మెల్సీలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి.బాలసుబ్రహ్మణ్యం మంగళవారం ప్రజాశక్తికి తెలిపారు. విజయవాడలో నిర్వ హించే ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, వై శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు, ఐ వెంకటేశ్వరరావులతోపాటు స్వతంత్ర ఎమ్మెల్సీ లు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం, అధికా రుల మొండివైఖరి వల్ల ఉపాధ్యాయుల ప్రయో జనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు
మండల కేంద్రాల్లో నిరసనలు : ఫ్యాప్టో
ఈ నెల 24న మండల విద్యాశాఖ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది. బదిలీల్లో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, పోస్టులు బ్లాకింగ్ ఎత్తివేయాలని ఫ్యాప్టో చైర్మన్ జివి నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ కె నరహరి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.