Wednesday, December 23, 2020

ఉపాధ్యాయ బదిలీలపై 24న ఎమ్మెల్సీల దీక్ష



Read also:

ఉపాధ్యాయ బదిలీల్లో విద్యాశాఖ మొండి

వైఖరిని విడిచి పెట్టాలని, టీచర్ల ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని, ఉపాధ్యాయ పోస్టు లన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న ఎమ్మెల్సీలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి.బాలసుబ్రహ్మణ్యం మంగళవారం ప్రజాశక్తికి తెలిపారు. విజయవాడలో నిర్వ హించే ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, వై శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు, ఐ వెంకటేశ్వరరావులతోపాటు స్వతంత్ర ఎమ్మెల్సీ లు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం, అధికా రుల మొండివైఖరి వల్ల ఉపాధ్యాయుల ప్రయో జనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు

మండల కేంద్రాల్లో నిరసనలు : ఫ్యాప్టో

ఈ నెల 24న మండల విద్యాశాఖ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది. బదిలీల్లో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, పోస్టులు బ్లాకింగ్ ఎత్తివేయాలని ఫ్యాప్టో చైర్మన్ జివి నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ కె నరహరి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :