Read also:
నేడు, రేపు ఆప్షన్లకు అవకాశం
23 నుంచి ఎంఈవోల నేతృత్వంలో మార్పులు చేర్పులు
ఎమ్మార్సీలో ప్రత్యేక కౌంటర్లు
- వెబ్ ఆప్షన్లు అసలు ఇవ్వని వారు సోమ, మంగళవారాల్లో సంబంధిత ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకొవచ్చు. తరువాత ప్రింట్ కాపీ తీసుకుని అక్కడే ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి
- 23 నుంచి ఎంఈవోల నేతృత్వంలో మార్పులు చేర్పులు
- సర్వర్ పనిచేయకపోవడంతో కొందరు రెండు మూడు పర్యాయాలు ఆప్షన్లు ఇచ్చినా.కొంతమేర అసంపూర్తి సమాచారo వచ్చింది
- ఇటువంటి టీచర్లు ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు సంబంధిత ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
- అయితే రోజుకు పది మంది టీచర్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇలా మార్పులు చేర్పులు చేసుకునే టీచర్లకు ఓడీ మంజూరు చేస్తారు.
- కాగా మార్పులు చేర్పులకు ఎంఈవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు తెరవాలని విద్యా శాఖ ఆదేశించింది.
- ఎంఈవో నేతృత్వంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు మాత్రం ఈ ప్రక్రియ చేయాలి.
- ఉపాధ్యాయ సంఘాలను అనుమతించ వద్దని ఆదేశాలు వచ్చాయి.