Read also:
Suspension of Teachers' Service Extension Orders
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రిటైర్మెంట్ తర్వాత ఏడాది సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సరైన మార్గదర్శకాలు లేవంటూ 2018లో టీడీపీ సర్కార్ హయాంలో ఇచ్చిన ఏడాది పొడిగింపు జీవో 101ను నిలివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఈ జీవోతో న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశముందని విద్యాశాఖ తెలిపింది.