Read also:
ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా బుధవారం నుంచి హేతుబద్ధీకరణ ప్రారంభం కానుంది. మారిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థుల చైల్డ్ఇన్ఫో వివరాలు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని మిగులు ఉపాధ్యాయులను ఈ నెల 9వ తేదీలోగా సర్దుబాటు చేస్తారు. ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. బుధవారం ఉదయానికి విద్యాశాఖకు పాఠశాలల వారీగా విద్యార్థుల నమోదు వివరాలు అందుబాటులోకి వస్తాయి. గత నెలలోనే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినా విద్యార్థుల నమోదుకు ప్రతిబంధకంగా ఉండటంతో మరో 10రోజుల పాటు అవకాశం ఇచ్చారు. కొత్త వివరాల మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.