Read also:
రాష్ట్ర వ్యాప్తంగా 9, 10 తరగతులకు సంబంధించి పాఠశాలలు తెరుచుకున్నాయని, రెండో రోజైన మంగళవారం సగటున 33.69 శాతం హాజరు నమోదైందని విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో అన్ని పాఠశాలల్లో కొవిడ్ ర్యాండమ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండో రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 99.92 శాతం ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయని, ఉపాధ్యాయుల హాజరు శాతం 90.92 శాతం ఉందని తెలిపారు. ఇక 9వ తరగతి విద్యార్థుల హాజరు శాతం 25.19, పదో తరగతి విద్యార్థుల హాజరు శాతం 42.38 ఉందని, మొత్తం హాజరు శాతం 33.69 ఉందని వివరించారు. క్రమంగా హాజరు శాతం పెరుగుతుందని, కొవిడ్ కు సంబంధించిన అన్ని ప్రొటోకాలను పాఠశాలల్లో అమలు చేస్తున్నామని మంత్రి డా.సురేష్ స్పష్టం చేశారు.