Read also:
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షి్ప(ఎన్ఎంఎంఎస్) పరీక్ష కోసం ఏపీలో 8వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 ఫిబ్రవరి 14న పరీక్ష జరుగుతుందన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్, ఏపీ మోడల్ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు www.bseap.org లో, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.