కరోనా వైరస్ కారణంగా డిజిటల్ లావాదేవీలు, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు జోరందుకున్నాయి. దీంతో ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మన బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది. అలా అయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయని మెసేజ్ రాగానే బ్యాంక్ కు కాల్ చేయాలి. వెంటనే మీ అకౌంట్ లావాదేవీలను క్యాన్సిల్ చేసుకోవాలి. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాలి. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిన విషయాన్ని చెప్పాలి.అప్పుడు వారు మీ డబ్బులు ఎక్కడి నుంచి కట్ అయ్యాయో తెలుసుకుంటారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు ఎవరు? ఎలా? కొట్టేశారని, ఎలా డబ్బులు డెబిట్ అయ్యాయని తెలుసుకున్న తర్వాత మీ డబ్బులను మీకు మళ్లీ క్రెడిట్ చేస్తారు.