ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల మేరకు టీచర్ల సాధారణ బదిలీ షెడ్యూల్ను సవరించను న్నారు. విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండు నుంచి ఐదు రోజులపాటు షెడ్యూల్ పొడిగించే అవకాశా లున్నాయి. దీనివల్ల గ్రేడ్ – 2 హెచ్ఎంల బదిలీకి గరిష్ట సర్వీసును ఐదేళ్ల స్టేషన్ సర్వీసుగా తీసుకోనుం డడంతో తప్పనిసరి బదిలీ జాబితా నుంచి కొంత మంది ప్రధానోపాధ్యాయులకు బదిలీ నుంచి ఉపశమనం కలగనుంది. మిగతా టీచర్లకు సంబంధించి 55 ఎన్టైటిల్మెంట్ పాయింట్ల పరిమి తిని, టోటల్ పాయింట్స్ 85 పరిమి తిని తొలగించారు. ఇక సర్వీసు సీనియార్టీ పాయింట్లను 15 నుంచి 16.5కు పెంచడం వల్ల జూనియర్లతో సమానంగా ఉన్న సీనియర్ టీచర్లు ఒక్కసారిగా బదిలీల్లో ముందుకు వచ్చే ప్రయో జనం లభించనుంది. మంగళవారం జరగాల్సిన సీనియార్టీ జాబి తాల విడుదల ప్రక్రియను నిలిపివేయడంతో సవరించిన బదిలీ షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులకు బదిలీ
ఉపాధ్యాయ బదిలీల నిబంధనలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు ఒకటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. గతంలో 5 అకడమిక్ సంవత్సరాలు ఉండగా.దానిని ఐదేళ్లుగా మార్పు చేసింది. ప్రస్తుత పాఠశాలలో ఎన్నేళ్లు పని చేస్తే అన్ని స్టేషన్ పాయింట్లు ఇస్తారు. గతంలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు పరిమితి విధించగా.. పని చేసిన కాలానికి పూర్తిగా పాయింట్లు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. సర్వీసు పాయింట్లు గరిష్ఠంగా 15 ఉండగా వీటిని 16.5 పాయింట్లుగా మార్పు చేసింది. 33 ఏళ్ల వరకు సర్వీసుకు పాయింట్లు కేటాయిస్తారు.