Read also:
- ఆర్థికశాఖ అధికారుల హామీ
- ఎన్ జీ వో సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి
నవంబరు జీతాలు డిసెంబర్ ఒకటిన ఇవ్వడానికి ఆర్థికశాఖ అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్ జీ వో సంఘం అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆర్థికశాఖ కార్యదర్శి, సీఎఫ్ఎంఎస్ సీఈవోలను కలిసి మాట్లాడినట్లు ఆయన శనివారం రాత్రి తెలిపారు. హెచ్ ఆర్ డేటా నమోదుకు, జీతాలకు సంబంధం లేకుండా చూస్తున్నామని వారు చెప్పినట్లు వెల్లడించారు. జీతాల బిల్లులు సమర్పించేందుకు ఏర్పాటు చేశామని వారు చెప్పినట్లు తెలిపారు.