Read also:
వన్టౌన్, న్యూస్టుడే: ఉచిత రేషన్లో ఆ సారి బియ్యం, శనగలతోపాటు గోధుమలు ఇవ్వనున్నారు. కుటుంబానికి ఇచ్చే బియ్యంలో కిలో తగ్గించి దానికి బదులుగా కిలో గోధుమలు ఇవ్వనున్నామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు పి.వెంకటరమణ తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో మార్చి నుంచి నెలకు రెండుసార్లు ఉచిత రేషను పంపిణీ చేపట్టామని, ఈ నెలలో జరగనున్న 16వ విడత పంపిణీతో ఉచిత రేషన్ ముగియనున్నదని తెలిపారు. జిల్లా అవసరాలకు 1250 టన్నుల గోధుమలు కేటాయించినట్లు చెప్పారు.