Read also:
★ ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్రవ్యాప్తంగా 75,718 మంది దరఖాస్తు చేశారు.
★ వీరిలో తప్పనిసరి బదిలీ అయ్యేవారు 24,535 మంది ఉండగా.
★ రెండేళ్లు పూర్తి చేసుకుని అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారు 51,183 మంది ఉన్నారు.
★ దరఖాస్తుల పరిశీలన బుధవారం రాత్రి వరకు జరగనుంది.
★ ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నారు.
★ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు సమీపంలో పని చేస్తున్న వారిలో సుమారు 10వేల మంది,
★ మారుమూల ప్రాంతాల్లోని కేటగిరీ-3, 4లోని బడులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
★ తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసిన వారిలో సుమారు 8వేల మంది హేతుబద్ధీకరణ కారణంగా పోస్టులు కోల్పోయినవారు ఉన్నారు.