Read also:
ఏప్రిల్ తరువాత మాత్రమే పదో తరగతి పరీక్షలు ఉంటాయని విద్యార్థులు అప్పటి వరకు చక్కగా చదువుకోవాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఆయన కొద్ది సేపు ముచ్చటించారు. తరగతి గదిలో విద్యార్థులు స్కూల్ యూనిఫామ్, బూట్లు వేసుకుని వస్తున్నారా.షూస్ సరిపోతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 35 శాతం సిలబస్ తగ్గించారన్నారు. విద్యారులు తప్పనిసరిగా మూడు పనులు చేయాలని, క్రమం తప్పకుండా పాఠశాలకు రావడం, శ్రద్ధగా పాఠ్యాంశాలు వినడం, నిత్యం పుస్తకాలు చదవడం చేయాల న్నారు. కార్యక్రమంలో డీఈవో గంగాభవాని, పీవో వెంకట ప్పయ్య, డీవైఈవో నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.