Read also:
జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు హాజరవు తున్న 9,10 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి ప్రభుత్వం రూపొ ందించిన ప్రత్యేక యాప్ లోనే హాజరు నమోదు చేయాలని డీఈవో వీఎస్ సుబ్బారావు ఆదివారం ఓ ప్రకటనలో ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు యాప్లో హాజరు నమోదు చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. అలాగే స్కూళ్లకు విద్యార్థుల గైర్హాజరు పై ఎంఈవోలు, ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సర్వే చేయించి గూగుల్ ఫామ్లో నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ క్లాసులు విషయంలో ప్రైవేటు పాఠశాలలు పాటిస్తున్న వివరాలను ఈనెల 17 నా టికి ఆప్లోడ్ చేయాలని డీఈవో ఆదేశించారు.