మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మున్సిపల్ శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యా యుల బదిలీల కౌన్సెలింగ్ అంశంపై చర్చించేందుకు ఉపాధ్యా యల సంఘాలతో ఆయన బుధవారం గుంటూరులో సమావేశమ య్యారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ విధివిధా నాలను మున్సిపల్ ఉపాధ్యాయులకు వర్తింపజేయ వద్దని సంఘాలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధ నలను 2017లో క్రమబద్ధీకరించడంతో అప్పటి నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. రవీంద్రబాబు మాట్లాడుతూ. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలతో కూడిన నివేదికను పురపాలక శాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్కు నివేదిస్తానని చెప్పారు. దీనిపై అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.