Read also:
9 వ మరియు 10వ తరగతి విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ - ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక
- తేదీ 16.11.2020 న 9 వ మరియు 10వ తరగతి విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించవలసిందిగా గౌరవ కమిషనర్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారు ఆదేశించడం జరిగింది
- డీసీఈబీ కార్యాలయం నుండి ప్రతి పాఠశాలలోని విద్యార్థులందరికీ సరిపడా ప్రశ్న పత్రాలు అన్ని మండలాలకు పంపించ బడ్డాయి
- తెలుగు, ఇంగ్లీష్ మీడియం వారికి విడివిడిగా ప్రశ్నా పత్రములు ప్యాక్ చేసి పంపించ బడ్డాయి
- ప్రధానోపాధ్యాయులు అందరూ మండల విద్యాశాఖ అధికారులు నుండి ప్రశ్నాపత్రంల బండిల్స్ పొంది ఉంటారు
- బహుళైచ్ఛిక ప్రశ్నలతో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది
- ప్రతి సబ్జెక్టులో 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి
- మొత్తం ఆరు సబ్జెక్టులలో 60 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది
- తేదీ 16.11.2020 న తప్పనిసరిగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి
- పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
- పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులను csc వెబ్ సైట్ నందు వెంటనే నమోదు చేయవలెను
- ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి వారి అంగీకారంతో అందరు విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యేటట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి
- జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రకాశం జిల్లా వారి ఆదేశాలతో - సెక్రటరీ, డీసీఈబీ.