Wednesday, November 4, 2020

Base line exam for 9th calss students



Read also:

జిల్లాలోని 9వ తరగతి విద్యార్థులకు బుధవారం పఠనాసక్తిపై బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించాలని సమగ్ర శిక్ష ఆదేశాలు జారీ చేసింది. ‘మేము చదవటాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది నవంబర్‌ 14 వరకు నిర్వహించనున్నారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బేస్‌లైన్‌ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో తెలుగు, ఆంగ్ల భాష సామర్థ్యాలను కొలవనున్నారు. పరీక్ష పత్రాలను ఉపవిద్యాశాఖాధికారులు, ఎమ్వీవోలు, సీఆర్పీల ద్వారా ప్రధానోపాధ్యాయుల వాట్సాప్‌ గ్రూపులకు పంపిస్తామని ఎస్‌ఎస్‌ ఏఎంవో ఆర్‌.శ్యాంసుందరరావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని, దాతల నుంచి పుస్తకాలు సేకరించి పాఠశాలల్లో భద్రపర్చాలని తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :