Read also:
APTEACHERS:నేటితో టీచర్ల బదిలీకి దరఖాస్తు గడువు ముగింపు
టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు సోమవారం ముగియనుంది. జిల్లాలో బదిలీలకు మొత్తం 10934 మంది ఉపాధ్యా యులు అర్హులుగా తేలగా వీరిలో తప్పనిసరి బదిలీ కింద 359 మంది, రిక్వెస్ట్ బదిలీకి 1751 మంది కలిపి మొత్తం 2710 మంది మాత్రమే శనివారం రాత్రి వరకూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు పొడిగించేది లేదని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ దఫా బదిలీలకు షెడ్యూల్డ్ ఏరియాలో పనిచేస్తున్న టీచర్లు, ప్లెయిన్ ఏరియా (జనరల్ ఏరియా)కు కూడా బదిలీ కోరుకోవచ్చునని వెసులుబాటు కల్పించారు.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తరువాత హార్ట్ కాపీలను వెరిఫికేషన్ నిమిత్తం ఎంఈవోలకు అందజేయాల్సి ఉంటుంది.