Read also:
2018-20 బ్యాచ్ డీఎడ్ విద్యార్థులు సెకం డియర్ పరీక్ష ఫీజును ఎలాంటి ఆలస్య రుసుమూ లేకుండా డిసెంబర్ ఒకటో తేదీ వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 7 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.125 రెండు సబ్జెక్టులకు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.175, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టుల వరకు రూ.250 ఉంటుందని పేర్కొన్నారు.