Read also:
టీచర్లకు నేడు, రేపు తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఈ నెల 19, 20 తేదీలలో తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్ జరగనుంది.
ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు (డీఈఓ) గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ జాబితాను విడుదల చేశారు.
రెండు రోజులపాటు ఆన్లైన్ విధానంలోనే తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
అయితే, వీరికి సాధారణ బదిలీలు ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులను మాత్రమే కేటాయిస్తారు.
ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు సర్దుబాటు (రీ అప్పోర్షన్) ప్రక్రియను నిర్వహించనున్నారు.