నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం
పటిష్టంగా కోవిడ్ రక్షణ చర్యలు
రోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులు
కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను వివరించారు.
AP: పాఠశాలలు, కాలేజీలు ప్రారంభంపై ఏపీ సీఎంవో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 9, 10, 11 12 తరగతుల విద్యార్థులకు నవంబర్ 2 నుంచి.. 6, 7, తరగతుల విద్యార్థులకు నవంబర్ 23 నుంచి క్లాసెస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులు ప్రారంభం కానున్నాయి.
- నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.
- నవంబర్ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్డే మాత్రం నిర్వహిస్తారు.
- హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.
- నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
- డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.