Read also:
- సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో బడిగంటలు మోగబోతున్నాయి. కోల్పోయిన విద్యాసంవత్సరాన్ని కవర్ చేసేలా సిలబస్ రూపొందించినట్టు ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
- కేంద్రం గైడ్ లైన్స్ ను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తామని అన్నారు. అన్ని జాగ్రత్తలతో స్కూళ్లను తెరుస్తున్నట్టు అయన తెలిపారు.
- నవంబర్ 2 నుంచి 9,10 తరగతులలో పాటుగా సెకండ్ ఇయర్ ఇంటర్ తరగతులను ప్రారంభిస్తామని అన్నారు.
- నవంబర్ 16 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు జరుగుతాయని తెలిపారు.
- నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతులు, డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
- నవంబర్ 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్లు ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతులకు షెడ్యూల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. 2020-21విద్యా సంవత్సరాన్ని వచ్చే ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేస్తామని అన్నారు.
- స్కూళ్ల పనిదినాలు 180 రోజులు ఉంటాయన్నారు. ఇక స్కూళ్లకు సంబంధించిన అకాడమిక్ ఇయర్ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలతో ముగిసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.