పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను కుదించింది. 1-10 తరగతుల్లోని అన్ని పాఠ్యాంశాల్లో 25-30శాతం మేర తగ్గించింది. ఈ మేరకు కుదించిన పాఠ్యాంశాల వివరాలను బుధవారం ప్రకటించింది.
దీనిపై అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు పాఠశాలల ప్రధానోపాఽధ్యాయులకు తెలపాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే ఉన్న మొత్తం సిలబ్సను యధావిఽధిగా బోధిస్తారు. ఇందులో 30శాతం పాఠ్యాంశాలను యాక్టివిటీ, ప్రాజెక్టుగా బోధిస్తారు. కానీ, వీటిని పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు. 70శాతం సిలబ్సకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు
మారిన సిలబస్ ప్రకారం పదోతరగతి ఆంగ్లంలో మొత్తం 8 పాఠాలకు 2 పాఠాలను యాక్టివిటీ, ప్రాజెక్టుగా పేర్కొన్నారు. వీటిని బోధించినప్పటికీ.పరీక్షల్లో వీటి నుంచి ప్రశ్నలు అడగరు. అలాగే 10వ తరగతిలో సాంఘిక శాస్త్రంలో 29%, ఫిజికల్ సైన్స్లో 27%, బయలాజికల్ సైన్స్లో 30%, హిందీలో 19% తగ్గించారు. అయితే మేథమెటిక్స్ సిలబ్సను తగ్గించలేదు.