Monday, October 19, 2020

Sachivalayam



Read also:

సచివాలయ ఉద్యోగ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో ఈసారి ర్యాంకులను వెల్లడించనున్నారు. 14 రకాల రాత పరీక్షల్లో వేర్వేరుగా అత్యధిక మార్కులు సాధించిన వారికి తొలి ర్యాంకు మొదలు చిట్టచివరి స్థానంలో మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి వరకు ఈ ర్యాంకులను వెల్లడించనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. జిల్లాల రిజర్వేషన్లు కూడిన ర్యాంకుల ఆధారంగానే ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఫలితాలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, 19 కేటగిరీలలో మొత్తం ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రకాల రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 1057355 మంది దరఖాస్తు చేసుకోగా 7,69,034 మంది హాజరయ్యారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :