Read also:
- ఉపాధ్యాయ బదిలీలపై నేడు సమావేశం
- సంఘాలతో చర్చించనున్న కమిషనరు
ఉపాధ్యాయ బదిలీలపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాఠశాల విద్యాశాఖ కమిషనరు వి.చినవీరభద్రుడు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 12న విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీ, రేషనలైజేషన్ జిఓల్లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని, బదిలీల ఉత్తర్వులు విడుదల చేసే ముందు తమతో చర్చించలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను కుదించేలా ఈసారి రేషనలైజేషన్ మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 1:20 గా ఉన్న ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:30గా ప్రతిపాదించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న మోడల్ వ్యవస్థను రద్దు చేసింది.