Read also:
మధ్యాహ్నభోజన కార్మికులు ఇవి ధరించకూడదు-కేంద్ర విద్యాశాఖ షరతులు
పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.
గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్లైన్స్ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ తెలిపారు.
మార్గదర్శకాలివే :
- మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.
- పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.
- పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.
- మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్ ధరించాలి.
- నెయిల్ పాలిస్(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.
- వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.
- ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.
- మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.
- కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్ క్లోరిన్తో కడగాలి.
- అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్లలో భోజనం వడ్డించాలి.
- సీటింగ్ అరేంజ్మెంట్లో మార్కింగ్ ఉండాలి.
- భోజనం 65డిగ్రీల సెల్సియస్ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.