Read also:
పాఠశాలలకు త్వరితగతిన ఫర్నీచర్ చేర్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. నవంబరు 15 నాటికి ‘నాడు -నేడు’ పనులు పూర్తి చేయాలన్నారు. గురువారం సమగ్ర శిక్ష కార్యాలయంలో ‘నాడు-నేడు’ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 9, 10 తరగతుల్లో ఏర్పాటు చేసే డ్యూయల్ డెస్కులను విద్యార్థుల సౌకర్యార్థం మరింత పెద్దగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ వారంలోపు నమూనా ఖరారు చేసి ఆర్డర్లు ఇవ్వాలన్నారు.