♦ఏపీ ఎంసెట్-ఎంపీసీ స్ర్టీమ్ అభ్యర్థులకు
♦బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సులకు మాత్రమే
♦23-27 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన
ఎంసెట్-ఎంపీసీ స్ట్రీమ్ అడ్మిషన్ల ప్రక్రి య శుక్రవారం ప్రారంభం కానుంది. బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సులకు మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. 23-27 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఇందుకోసం ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.600
సర్టిఫికెట్ల పరిశీలన ఇలా.
శుక్రవారం: 1 నుంచి 20,000వ ర్యాంక్ వరకు
శనివారం: 20,001 నుంచి 50,000వ ర్యాంక్ వరకు
ఆదివారం: 50,001 నుంచి 80,000వ ర్యాంక్ వరకు
సోమవారం: 80,001 నుంచి 1,10,000వ ర్యాంక్ వరకు
మంగళవారం: 1,10,001వ ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు
ఇతర కేటగిరీలకు విజయవాడలో మాత్రమే
పీహెచ్, కాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు విజయవాడలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల(బెంజ్సర్కిల్)లో మాత్రమే జరుగుతుంది.