ఈ రోజు (28-10-#020) పి.డి.ఎఫ్. యం.ఎల్.సి.లు కె.యస్.లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఇళ్ళ వేంకటేశ్వర రావు, యు.టి.ఎఫ్.రాష్ట్ర నాయకత్వం షేక్ సాబ్జి, కె.యస్.యస్.ప్రసాద్, నక్కా వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసరావు లు విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారిని కలిసి బదిలీలు, రేషనలైజేషన్ సమస్యల గురించి చర్చించారు.
👉మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని, 80 పై బడిన రోలు కలిగిన పాఠశాలల్లో 5 గురు టీచర్లు ఉంచాలని
👉సర్వీస్ పాయింట్స్ 0.5 నుండి 1కి పెంచాలని
👉మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, సాధ్యం కాని పక్షంలో ఆన్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని
👉బదిలీలు, ప్రమోషన్స్ కేడర్ వారీ జరపాలని (HM బదిలీలు- HM ప్రమోషన్స్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ బదిలీలు - ప్రమోషన్స్, తరువాత SGT బదిలీలు)
వీటిపై మంcత్రి సానుకూలంగా స్పందించారు
👉అలాగే ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని ఇతర సమస్యల పైన వారి ద్వారా ముఖ్య మంత్రి గారికి మెమొరాండం ఇవ్వడమైనది.