AP Corona Cases: ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో భారీగా తగ్గిన కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల వ్యవధిలో ఏపీలో 3986 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 783132కి చేరింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల వ్యవధిలో ఏపీలో 3986 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 783132కి చేరింది.
ఇక 24 గంటల వ్యవధిలో 23మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6429కి పెరిగింది.
ఏపీలోని రెండు జిల్లాల్లో 100 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 55, విజయనగరంలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 528, కృష్ణా 503, గుంటూరు 496, తూర్పుగోదావరి 481, చిత్తూరు 458, ప్రకాశం 334, కడప 266, విశాఖపట్నం 218, అనంతపురం 201, నెల్లూరు 196, శ్రీకాకుళం 168 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో 24 గంటల వ్యవధిలో 74,945 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటి వరకు ఏపీలో 70,66,203 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. 24 గంటల్లో ఏపీలో 4591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 740229 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 36474 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.