Saturday, October 24, 2020

All including PRC cleared by May 2021



Read also:

ముఖ్యమంత్రి అంగీకారం

ఎన్ జీవో నేతలు వెల్లడి .

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల డిమాండ్ లన్నిటిని 2021 ఏప్రిల్ లోపల దశల వారీగా పరిష్కరిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం చంద్రశేఖర్ రెడ్డి  బండి శ్రీనివాసరావు లు తెలిపారు . పీఆర్సీ, డి‌ఏ  తో సహా అన్నీ 2021 మే నాటికి క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు .  శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీఎన్జీవో రాష్ట్ర శాఖ ప్రతినిధులతో దాదాపు ఇరవై నిముషాలు ముఖ్యమంత్రి తో వివిధ ఉద్యోగ సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.

వివరాలు ఇలా ఉన్నాయి

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లస్థలాల మంజూరు
  • ఏసిటీఓ లకు గె జిటెడ్ హోదా
  • మహిళా  ఉద్యోగులకు ఏడాదికి 5 అదనపు సెలవు దినాలు
  • నాల్గవ తరగతి ఉద్యోగుల
  • కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
  • ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు హాజరవడానికి సీఎం అంగీకారం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :