Read also:
Aadhaar Services in Village Secretariats
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తంగా 800 సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేలా అదికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. తొలి విడతగా ఆధార్ నమోదు కేంద్రాలు లేని మండలాల్లో ఉన్న 114 సచివాలయాల్లో అక్టోబర్ నెలాఖరులో ప్రారంభించనుంది.