Read also:
- 1 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు
- రెండు నియోజకవర్గాల్లో ముగియనున్న పదవీకాలం
- రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది.
- ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న రాము సూర్యారావు , కృష్ణా-గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న ఏ.ఎస్.రామకృష్ణ వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన రిటైర్ కానున్నారు.
- ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
- 2020 నవంబర్ 1 అర్హత తేది కాగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అదే తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలను, మార్పులు చేర్పులను స్వీకరించనున్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 18వ తేదీన ప్రకటిస్తారు.