Read also:
సిద్ధమవుతున్న ప్రీస్కూల్ పాఠాలు
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రవ్యాప్తంగా 11,900 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ విద్య (పూర్వ ప్రాథమిక)ను అమలు చేయనున్నారు. ఇందుకు అవసరమయ్యే పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ అక్టోబరు 25లోపు సిద్ధం చేయనుంది. పాఠ్యాంశాల కోసం జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి, ప్రపంచ బ్యాంకు రూపొందించిన ప్రేరిక్, ఆంధ్రమహిళా సభ, గుంటూరులోని వెంకటేశ్వర కుటీర్, చీపురుపల్లిలోని శోధన స్వచ్ఛంద సంస్థ అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తున్నారు. వీటిలో నుంచి కొన్ని అంశాలను తీసుకొని పుస్తకాలను రూపొందించనున్నారు.