2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఆ 6,510 మంది టీచర్లకు పాత పెన్షన్ విధానమే
ఆంధ్రప్రదేశ్ లో 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై ప్రస్తుతం విధుల్లో ఉన్న టీచర్లు మొత్తం 13 జిల్లాల్లో 6,510 మంది ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది. వీరికి పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు వీలుగా వారి వివరాల జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభధ్రుడు సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి పంపారు. కేంద్ర ప్రభుత్వం 1972 సెంట్రల్ సివిల్ సర్వీసు పెన్షన్ రూల్సు ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో పెన్షన్ పథకం వర్తింపేజేసే విషయంలో మార్గదర్శకాలు ఈ ఏడాది ఫిబ్రవరి 20న విడుదల చేసింది. ఆ ప్రకారం 2003 డిసెంబర్ 31 నాటికి వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీలు గుర్తించి 2004 జనవరి ఒకటి కి ముందు రిక్రూట్ మెంట్ ప్రకటించిన పోస్టులకు పాత పెన్షన్ విధానం అమలు చేసే వెసులుబాటు దక్కింది.
Download the GO COPY